ఒక్క సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా. సుకుమార్ శిష్యుడిగా గా చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు తర్వాత దర్శకుడిగా మారి ఉప్పెన సినిమాలు చేసిన విషయం మనకు తెలిసినదే. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు అయినా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యారు. అదే విధంగా హీరోయిన్  గా కృతి శెట్టి కూడా పరిచయం అయింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు  విజయ్ సేతుపతి గారు ప్రతి కథానాయకుడి పాత్రలో అద్భుతంగా నటించారు.

సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసింది. మొదటి సినిమా వంద కోట్లు సాధించడం నిజంగా  రికార్డే. ఆ రికార్డును వైష్ణవ మరియు బుచ్చిబాబు దక్కించుకున్నారు. ఇక ఆ సినిమా తర్వాత బుచ్చిబాబు ఉ ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.జూనియర్ ఎన్టీఆర్ కి సుకుమార్ కు మంచి స్నేహంఉంది. అలాగే బుచ్చిబాబు కు తారక్ తో మంచి పరిచయం ఉంది. ఈ క్రమంలో బుజ్జిబాబు తారక్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని ఆ మధ్య వినిపించింది. బుచ్చిబాబు కూడా ఉప్పెన సినిమా తర్వాత తన కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం తారక్ త్రిబుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు.


 ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలు అయిపోయిన తర్వాత బుచ్చిబాబు తో సినిమా ఉంటుందని అన్నారు.  బుచ్చిబాబు ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో మీ తర్వాత సినిమా తారక్ తో నా అడిగినప్పుడు ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదు. అదే సమయంలో ఆయన ఒక ప్రముఖ హీరో కోసం ఒక ప్రాంతీయ కథను సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. దానితో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.   మరి ఏం జరుగుతుందో తెలియాలంటే  కొంతకాలం ఆగాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: