సినిమా అనేది రంగుల ప్రపంచంలో కొంతమంది క్రేజ్ సంపాదించడానికి ఎంతో కష్టపడి పోతూ ఉంటారు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక చివరికి స్టార్ డమ్ కోసం పాకులాడుతూ ఉంటారు. కొంతమందికి మాత్రం ఇక సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ తోనే భారీగా సంపాదించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చిత్ర పరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో ఒకరు బుచ్చిబాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్న సుకుమార్ శిష్యుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బుచ్చిబాబు ఉప్పెన అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


ఇక ఒక విభిన్నమైన లవ్ స్టోరీ.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది అనుకున్న దాని కంటే మంచి విజయం సాధించడంతో ఈ సినిమా దర్శకుడైన బుచ్చిబాబు కు ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాగా కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా తర్వాత హీరో హీరోయిన్లు కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ఉప్పర సినిమాతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఇక ఇప్పుడు బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది




 తన తర్వాతి సినిమా నే ప్రస్తుతం తెలుగు చిత్ర టాప్ హీరో గా కొనసాగుతున్న ఒక స్టార్ హీరోతో చేయబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కోడైకూస్తోంది. ఈ క్రమంలోనే బుచ్చిబాబు తర్వాత సినిమా ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం మైత్రి మూవీస్ నిర్మాణంలోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తన తర్వాత సినిమా ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిన్న హింట్ ఇచ్చాడు బుచ్చిబాబు. ఆల్రెడీ లైన్ చెప్పి ఒప్పించానని.. ఇక పూర్తిస్థాయి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాను అంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దర్శకుడు బుచ్చిబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: