విభిన్న సినిమాలు చేసే నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రయత్నం చేయబోతున్నారని  తెలుగు సినీ పరిశ్రమ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కంటే కూడా ఇప్పుడు బాలకృష్ణ తో సినిమా చేయాలని  పెద్ద దర్శకులకు ఆసక్తిగా మారింది. ఈ మధ్యకాలంలో బాలయ్యకు సరైన హిట్ లేదు. ఇప్పుడు బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న అఖండ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కారణం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు భారీగా విజయం సాధించాయి కాబట్టి. కానీ ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్కు ప్రస్తుతం మన ఏపీ లో ఉన్న పరిస్థితులకు ఆ చిత్రం ఎంత కలెక్షన్ చేస్తుందనేది నిర్మాతలను కలవరపెడుతుంది .

గోపీచంద్ మలినేని , అనిల్ రావిపూడి వంటి ప్రముఖ దర్శకుడు బాలయ్య తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ గారి తో సినిమా చేయడానికి దర్శకుడు కొరటాల శివ కూడా ఆసక్తికరంగా ఉన్నాడు. అది కూడా మల్టీ స్టార్ మూవీ కావడం విశేషం.
ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీ అనగానే అందరికీ గుర్తొచ్చేది రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా. ఈ సినిమాలో ఒకరు మెగా -మరొకరు నందమూరి యంగ్ హీరోలు కావడం విశేషం. అదే విధంగా మళ్లీ నందమూరి మెగా  హీరోల కాంబినేషన్ను తెరమీదకు తీసుకు రావడానికి కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో లో బాలకృష్ణ గారితో కలిసి నటించబోయే మెగాహీరో సాయి ధరమ్ తేజ అని తెలిసింది.


 దర్శకుడు కొరటాల శివ గారు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారని తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.మరి ఈ సినిమా ఎప్పుడో తెరమీదకు వస్తుందనేది వేచి చూడాలి. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి గారితో ఆచార్య మూవీ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత తారక్ తో ఇంకో సినిమా చేసినట్టు కూడా అనౌన్స్ చేశారు.మరి ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: