ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్, మంజు వారియర్ నటించిన పాత్రలో ఇప్పుడు తెలుగులో లో మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు నయనతార కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. మొదటి సినిమా సైరా నరసింహారెడ్డి. అయితే ఈ సినిమాలో నయనతార కథానాయకిగా నటించడం లేదు. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ ఇది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమా రూపొందించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు నయనతార తీసుకుంటున్న రెమ్యూనరేషన్ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు క్యారెక్టర్ చేయనున్నారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో వినిపిస్తున్న పరిస్థితుల ప్రకారం నయనతార ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. తెలుగులో ఇప్పటి వరకు హీరోయిన్లకు ఇచ్చిన పారితోషకం లో ఇదే అత్యధికం.
ఇప్పటికే నయనతార బర్త్ డే సందర్భంగా ఈ మూవీ యూనిట్ నయనతార ఫస్ట్ లుక్ ని విడుదల చేసి శుభాకాంక్షలు కూడా చెప్పారు. గాడ్ ఫాదర్ సినిమా కి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.