బాలకృష్ణ తో ప్రస్తుతం బోయపాటి శ్రీను తీస్తున్న భారీ యాక్షన్ సినిమా అఖండ. శ్రీకాంత్ తొలిసారిగా బాలయ్య సినిమాలో విలన్ గా చేస్తున్న ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ స్థాయిలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలయ్య మధ్యతరగతి రైతు గా అలానే అఘోరా గా రెండు పాత్రల్లో నటిస్తున్న ఈ అఖండ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడ విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా త్వరలో మిగతా సాంగ్స్ ని మరొక మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా మరొక పది రోజుల్లో ఎంతో ఘనంగా జరిపేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట. అయితే విషయం ఏంటంటే, నేడు ఈ సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు జరుగగా, సినిమాని ప్రత్యేకంగా వీక్షించిన సెన్సార్ సభ్యులు అద్భుతంగా ఉంది అంటూ కితాబిచ్చినట్లు టాక్.

అయితే ఈ అఖండ సినిమా రన్ టైం విషయం లో మాత్రం ఒకింత పెద్దదని, మొత్తంగా ఈ సినిమా 2 గం. 47 ని. ల నిడివి ఉంటుందని సమాచారం. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా అలానే బోర్ కొట్టకుండా బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు బోయపాటి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీసారని అంటున్నారు. ఇక డిసెంబర్ 2న విడుదల కానున్న అఖండ తప్పకుండా అఖండమైన విజయం సొంతం చేసుకుని హీరోగా బాలయ్య కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇవ్వడంతో పాటు బాలయ్య, బోయపాటి ల కాంబోకి హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: