హాట్ బ్యూటీ శృతి హాసన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సంవత్సరం శృతిహాసన్, రవితేజ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్సాఫీసు వద్ద అదిరిపోయే హిట్ ను అందుకుంది. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో కూడా మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది, ఇలా ఒకే సంవత్సరం టాలీవుడ్ లో రెండు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూడా తెలుగు నాట వరుస సినిమాల్లో నటిస్తోంది.

 ప్రస్తుతం శృతి హాసన్, ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా తో పాటు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్ బి కె 107 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటించబోతోంది, ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి, ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం శృతిహాసన్ రెండు కోట్ల వరకు డిమాండ్ చేసిందట, ఈ సినిమా నిర్మాతలు కూడా శృతి హాసన్ డిమాండ్ కు ఓకే చెప్పారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: