తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పరుచుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. ఒక కమర్షియల్ సినిమాను కూడా తన స్టయిల్ లో ఎంతో విభిన్నంగా తెరకెక్కించే దర్శకుడు అనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.సురేంధర్ రెడ్డి మరియూ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో విడుదలైన సైరా నరసింహ రెడ్డి అందుకు ఒక ఉదాహరణ. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాదిచిందో అందరికి తెలిసిందే.ఆ తరువాత సురేంధర్ రెడ్డి అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న ఏజెంట్ సినిమ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.ఈ సినిమ షూటింగ్ ఫారెన్ లో జరుగుతుండగా దర్శకుడు సురేంధర్ రెడ్డికి కరోన వచ్చినట్టు గుర్తించారు.ప్రస్తుతం సురేంధర్ రెడ్డి  మరియు అతని కుటుంబ సభ్యులు క్వారంటైన్ లో ఉన్నారు.

సినిమా లో భాగంగా రెండు వారాలపాటు అఖిల్,మమ్ముట్టిలపై కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.కానీ ఇప్పుడు కరోన కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.అఖిల్ తో పాటు మిగిలినవారు అందరూ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.ఈ మూవీ లో అఖిల్ ఒక సీక్రెట్ ఏజంట్ గా నటిస్తున్నాడు.హీరోయిన్ గా సాక్షివైద్య పరిచయం కానుంది.ఏకే ఎంటర్టైమెంట్ బ్యానర్,సురేందర్ సంయుక్త సమర్పణలో ఈ సినిమా రాబోతుంది.
-
అక్కినేని అఖిల్ ఈ సినిమాపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటె అఖిల్ తన కెరియర్ లో  బ్యాచులర్ మూవీ కి ముందు సక్సెస్ లేదు.బ్యాచులర్ మూవీ తరువాత తను కథలను ఎంచుకునే విధానం లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ సమయంలో అఖిల్ కు ఈ విషయం కొంత బాధాకరమని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్సినిమా అంచనాలను పెంచింది.సురేంధర్ రెడ్డి కోలుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్ళీ  ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల కాబోతున్న ఏజెంట్ మీద అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడే హిట్ ట్రాక్ లోకి వచ్చిన అఖిల్ కి ఈ సినిమా కూడా ఇంకొక హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: