హాట్ బ్యూటీ రాశి కన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో రాశి కన్నా తన అందంతో, నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.  అలా టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కు తెలుగునాట మంచి సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంది. అందులో భాగంగా టాలీవుడ్ లో ఎన్నో క్రేజీ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రాశి కన్నా తెలుగులో నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న థాంక్యూ,  సినిమా తో పాటు గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్క కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గెస్ నటిస్తోంది.

 ఈమధ్యే పక్కా కమర్షియల్ సినిమా నుండి విడుదలైన టీజర్ లో రాశి కన్నా పలికిన డైలాగ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. టాలీవుడ్ తో పాటు హాట్ బ్యూటీ రాశి కన్నా బాలీవుడ్ లో కూడా తన హవాను కొనసాగిస్తోంది, ఈ మధ్య ఒక బాలీవుడ్ ప్రాజెక్టుకు రాశి ఖన్నా గుడ్ బై చెప్పేసింది. రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ అంటూ రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ ను రాశి కన్నా పూర్తి చేసింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా కనిపించనున్నాడు, ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మూవీ యూనిట్ అంతా కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు, వీడ్కోలు పార్టీ ని ఘనంగా నిర్వహించుకున్నారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా కాంబినేషన్ లో రాజ్ అండ్ డీకేలు ఒక వెబ్ సిరీస్ ను తెరకేకేస్తున్నారు. ఇలా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ప్రాజెక్టులతో రాశి కన్నా ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా రాశి కన్నా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఈ ఉరుకుల పరుగుల జీవితం.. ఒక ఎయిర్ పోర్ట్ నుంచి మరో ఎయిర్ పోర్ట్‌కు వెళ్తున్నాను.. గోవా కు వెళ్తున్నాను అని హాట్ బ్యూటీ రాశికన్నా పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: