తెలుగు సినిమా పరిశ్రమలో తన మొదటి సినిమా తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ గుమ్మాకొండ.కార్తికేయ,అజయ్ భూపతి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100.ఆయన ఈ సినిమా తో హీరోగా పరిచయం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తను నటించిన చిత్రాలలో ఏ ఒక్క చిత్రం కూడా తనకు ఆ రేంజ్ హిట్ ఇవ్వలేకపోయింది. తను నటించిన గుణ 360, 90 ఎమ్మెల్, చావు కబురు చల్లగా,వంటి సినిమాల్లో కూడా తను ఆశించిన ఫలితాలను అందుకోలేక పోయాయి.

ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ పాత్రలో నటించారు. కానీ ఆ సినిమా కూడా కార్తికేయని నిరాశపరిచింది. కార్తికేయ కధలను ఎంచుకునే విధానం లో ముస పద్ధతి వ్యవహరిస్తున్నాడు. ఇక కార్తికేయ హీరో గా శ్రీ సిరిపల్లి ని దర్శకత్వంలో లేటెస్ట్ విడుదలైన మూవీ రాజా విక్రమార్క సినిమా కూడా దారుణమైన పరాజయం అందుకుంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకి అమ్మగా మొదటి వారం కలెక్షన్స్ కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా కలెక్షన్స్ బట్టి చెప్పాలి అంటే ఈ సినిమా కచ్చితంగా ప్లాప్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

 ఇక ఈ సినిమా తర్వాత కార్తికేయ తమిళంలో వాలిమై అనే సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి హీరో తమిళ స్టార్ హీరో అజిత్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు కార్తికేయ. ఇక నుంచి అన్న నాసిరకం కథలు ఎంచుకోకుండా మంచి కథలు ఎంచుకొని హిట్ కొట్టాలి అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మంచి హైట్ , బాడీ ఉండే కార్తికేయ కి ఇప్పుడు కచ్చితంగా ఒక  సాలిడ్ హిట్ కావాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: