విక్టరీ వెంకటేష్ ఈ వయస్సులోను కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తుంటారని అందరికి తెలుసు.. ఇటీవలి కాలంలో వెంకటేష్ ఎక్కువగా రీమేక్లు చేస్తున్నాడని తెలుస్తుంది.చివరిగా నారప్ప చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడని సమాచారం.ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయగా ఈ చిత్రం నిరాశపరచిందని తెలుస్తుంది.అయితే వెంకటేష్ నటించిన దృశ్యం 2 చిత్రం నవంబర్ 25న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారని తెలుస్తుంది వెంకటేష్.
మీడియాతో జోకులు వేసాడట వెంకీ మామ కొన్ని నిజాలు పరోక్షంగా చెప్పుకొచ్చాడని తెలుస్తుంది.. థియేటర్లో వేసినా లేదా ఓటీటీల్లో సినిమా వేసినా చూసే వారు చూస్తారని ఎంజాయ్ చేస్తారు అని అన్నాడట.ఇక తన తదుపరి చిత్రాల గురించి చెప్పుకొచ్చాడని తెలుస్తుంది.ప్రస్తుతం తన చేతిలో సినిమాలు లేవని తాను బాగా ఖాళీగా ఉన్నాను అంటూ కౌంటర్లు వేశాడని తెలుస్తోంది.దీంతో మీడియా ప్రతినిధులంతా నవ్వేశారని సమాచారం.
నిజంగానే చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్లు లేవన ఇంకా కథలు రెడీ కాలేదని చెప్పుకొచ్చాడాట.అందుకే ఖాళీగా ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడని తెలుస్తుంది.ఎఫ్ 3 సినిమా ముగింపు దశలో ఉందని అన్నాడట. వెంకీ రానాతో చేయబోయే ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉందని అన్నాడని తెలుస్తుంది.తరుణ్ భాస్కర్ ఇంకా కథను రెడీ చేసే పనిలోనే ఉన్నాడని చెప్పుకొచ్చారట.
మిగతా వాళ్లు కూడా కొన్ని కథలు రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.కానీ ఇంకా ఏవీ కూడా పూర్తి కాలేదని అన్నాడని సమాచారం.మొతానికి ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉన్నానని చెప్పేశాడట.కథలు వచ్చినప్పుడు చేద్దాం లేనప్పుడు ఖాళీగా ఉందాం అంటూ ప్రపంచం తిరుగుదాం అలాగే ధ్యానం చేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం దానికంటే ఏం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడట.
రీమేక్స్ ఎక్కువగా చేస్తుండడంపై స్పందించాదట వెంకటేష్… ఇలాంటి కథలు ఎవ్వరి దగ్గరికీ ఎందుకు వెళ్లలేదు ‘నారప్ప’ని తెలుగులో మరెవ్వరూ చేయలేదు కదా నేనే చేశానంటే కారణం ఏమిటి అంటూ జీవితంలో ఎవ్వరూ ఏ విషయం గురించి మరీ లోతుగా వెళ్లకూడదని ఇమేజ్ గురించి ఆలోచించను నా దగ్గరికి అదెందుకు రాలేదని ఇదెందుకు రాలేదని అటూ ఇటూ ఎప్పుడూ చూడనని నా దగ్గరికి వచ్చింది తీసుకోవడమే నాకు తెలుసని అదృష్టంకొద్దీ ఈ రంగంలోకి వచ్చానని ప్రేక్షకుల అభిమానం దొరికిందని ఎప్పటికప్పుడు కొత్త కథలు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని అని అన్నారట వెంకటేష్.