సింహా లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు చేసిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న  'అఖండ' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన  టీజర్స్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుండి భారీ ఎత్తున రెస్పాన్ వచ్చింది.కాగా తాజాగా అఖండ సినిమా రిలీజ్  డేట్ ను కూడా ప్రకటించారు.డేట్ చెప్పే సందర్భంలో అఖండ ట్రైలర్ రోల్ పేరుతో వచ్చిన  ట్రైలర్  ఇప్పుడు యూట్యూబ్ ను ఒక ఊపు ఊపిస్తుంది. ఈ ట్రైలర్ మాత్రం యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ ను క్రెయేట్ చేసింది.అయితే ఈ సినిమాలో బాలయ్య మాత్రం రెండు డిఫరెంట్ గెటప్స్ తో ప్రేక్షకులకు కనిపించనున్నాడు.

ఇదిలా ఉంటె తాజాగా విడుదలైన ట్రైలర్ లో  కనిపించిన టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అసలు ట్రైలర్ లో కనిపించిన వ్యక్తి ఎవరు అని అరా తిస్తే  కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయటపడ్డాయి.అయితే ఆయన పేరు నితిన్ మెహ్తా అట.ఇంతకుముందు 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీలో పని చేశారట.ఆర్మీ లో పనిచేయకముందు నుండే ఆయనకు సినిమాలన్న,యాక్టింగ్ అన్నా బాగా ఇష్టమట.అంతే కాకుండా మోడల్‌గా కూడా తాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.కొన్ని సినిమాల్లో నటించారట కూడా..నటుడిగా మాత్రం ఆయనకు ఎలాంటి అవకాశం రాలేదట.

కాగా తాజాగా అఖండ సినిమాతో ఆయనకు టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ నటుడిగా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.ఇకపోతే ట్రైలర్ చూస్తే  నేను ఆత్మ.. వాడు నా శరీరం అంటూ బాలయ్య అఘోరా క్యారెక్టర్ లో చెప్పారు.అలాగే యాక్షన్ సీన్‌లో రౌద్రంగా కనిపించి ఆకట్టుకున్నారు నితిన్ మెహ్తా.కాగా బాలక్రిష్ణ నటిస్తున్న అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు బాలయ్య. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: