ఇక చెన్నై చంద్రం త్రిష విషయంలో ఇదే జరిగిందట. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలోను స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న ఈ అమ్మడు..కెరీర్ పీక్ టైంలోనే వ్యాపారవేత్త వరుణ్ మణియన్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఎంతో ఘనంగా జరిగిన ఈ నిశ్చితార్ధానికి పలువురు బడా సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఇక అందరితో పాటే కోలీవుడ్ హీరో ధనుష్ కూడా హాజరైయ్యారు. కానీ ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే..ఈ నిశ్చితార్థానికి హీరో ధనుష్ ని మాత్రం పిలవద్దని త్రిషకు కాబోయే భర్త వరుణ్ పదేపదే చెప్పారట. కానీ ఆమె మాత్రం వినకుండా ధనుష్ ని ఆహ్వానించిందట.
సరే, అక్కడి వరకు బాగానే ఉన్నా..పక్కన కాబోయే మొగుడిని పెట్టుకుని కూడా ధనుష్ తో హగ్ లు,ముద్దులు పెడుతూ ఫోటోకి ఫోజులిచ్చిందట. ఇక ఈ ఈ వ్యవహారం పై నిశ్చితార్ధం తరువాత త్రిష కి-వరుణ్ మణియన్ కి చాలా పెద్ద గొడవలు జరిగాయట. మాట మాట పెరిగి..జరిగిన నిశ్చితార్ధాని క్యాన్సిల్ చేసుకునే వరకు వెళ్లారట. ఇక దీని పై ధనుష్ కూడా సన్నిహితుల దగ్గర స్పందిస్తూ.. "బుద్ధిలేక వెళ్లాను ..నా వల్ల వాళ్ళు విడిపోయారు" అని చాలా బాధపడ్డారట హీరో ధనుష్. అప్పట్లో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా నడిచింది. ప్రస్తుతం అమ్మడు సినిమా అవకాశాలు లేక కేవలం సోషల్ మీడియాకే అంకితం అయ్యింది. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుందో కూడా తెలియదు.