కోలీవుడ్ బడా హీరో ధనుష్..ఈయనకు ఉన్న క్రేజ్..ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది. పేరుకి రజినీకాంత్ అల్లుడు అయినప్పటికి..తన టాలెంట్ తో,పట్టుదలతో ఎంతో కష్టపడి కోలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరో,హీరోయిన్ లు క్లోజ్ గా ఉంటారు. సరదాగా మాట్లాడుకుంటారు. ఈ విషయాలు మనకు తెలిసిందే. ఏదైన మనం చూసే దానిలోనే ఉంటుంది. ఒక ఆడ మగ కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన అక్కడ వారి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లైతే కాదు కదా..

ఇక చెన్నై చంద్రం  త్రిష విషయంలో ఇదే జరిగిందట. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలోను స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న ఈ అమ్మడు..కెరీర్ పీక్  టైంలోనే  వ్యాపారవేత్త వరుణ్ మణియన్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఎంతో ఘనంగా జరిగిన ఈ నిశ్చితార్ధానికి పలువురు బడా సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఇక అందరితో పాటే కోలీవుడ్ హీరో ధనుష్ కూడా హాజరైయ్యారు. కానీ ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే..ఈ నిశ్చితార్థానికి హీరో ధనుష్ ని మాత్రం పిలవద్దని త్రిషకు కాబోయే భర్త వరుణ్ పదేపదే చెప్పారట. కానీ ఆమె మాత్రం వినకుండా ధనుష్ ని ఆహ్వానించిందట.

సరే, అక్కడి వరకు బాగానే ఉన్నా..పక్కన కాబోయే మొగుడిని పెట్టుకుని కూడా ధనుష్ తో హగ్ లు,ముద్దులు పెడుతూ ఫోటోకి ఫోజులిచ్చిందట. ఇక ఈ ఈ వ్యవహారం పై నిశ్చితార్ధం తరువాత త్రిష కి-వరుణ్ మణియన్ కి చాలా పెద్ద గొడవలు జరిగాయట. మాట మాట పెరిగి..జరిగిన నిశ్చితార్ధాని క్యాన్సిల్ చేసుకునే వరకు వెళ్లారట. ఇక దీని పై ధనుష్ కూడా సన్నిహితుల దగ్గర స్పందిస్తూ.. "బుద్ధిలేక వెళ్లాను ..నా వల్ల వాళ్ళు విడిపోయారు" అని చాలా బాధపడ్డారట హీరో ధనుష్. అప్పట్లో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా నడిచింది. ప్రస్తుతం అమ్మడు సినిమా అవకాశాలు లేక కేవలం సోషల్ మీడియాకే అంకితం అయ్యింది. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుందో కూడా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: