రాజమౌళి టాలీవుడ్ ని శాసితున్న బడా డైరెక్టర్స్ లో ఒకరు. అపజయం ఎరుగని దర్శకుడిగా.. బాహుబలి లాంటి సినిమా తెరకెక్కించిన దర్శక ధీరుడిగా సినీ చరిత్రలో నిలిచారు. ప్రస్తుతం ఈయన తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. టాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోలతో సినిమా అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇద్దరిలో ఏ ఒక్కరిని తక్కువ చేసిన ఫ్యాన్స్ ఊరుకోరు. పైగా అది మెగా వారసుడు,నందమూరి వారసుడితో సినిమా అంటె చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద రిస్కే. అలాంటి రిస్కులు చేయండంలో ముందుంటాడు మన జక్కన్న.

ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 7న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజ్  అయిన ఫస్ట్ లుక్స్, పాటలు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నాయి. ముఖ్యంగా నాటు నాటు పాటలో చరణ్,తారక్ ఇద్దరు మాస్ స్టెప్పులతో ఇరగదీసారు అనే చెప్పాలి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసారు రాజమౌళి.  ఇప్పటికే  ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసి.. సినిమా ప్రమోషన్‌ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నారు మన దర్శక ధీరుడు జక్కన్న.

కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ కండల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌ను మీట్ అయ్యారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా స‌ల్మాన్‌ఖాన్‌ను అహ్వానించదానికే వెళ్లిన్నట్లు తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి,చరణ్ కి  స‌ల్మాన్‌ఖాన్‌ జాన్ జిగిడి దోస్త్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ  వేడుకను రాజ‌మౌళి ముంబయిలోనే నిర్వహిస్తున్నారనే టాక్  వైరల్ గా మారింది. చరణ్‌ కి బదులుగా రాజమౌళి వెళ్లి ఆహ్వానిస్తేనే మర్యాదగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే జక్కన ఇలా ప్లాన్ చేసారట. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: