ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు మరియు చంద్రబాబు కన్నీరు పెట్టటం పైన పలువురు స్పందిస్తున్నారని తెలుస్తుంది.ఇప్పటికే రాజకీయ మరియు సినీ ప్రముఖులు అసెంబ్లీలో జిరగిన పరిణాల పైన కీలక వ్యాఖ్యలు చేసారని సమాచారం.

చంద్రబాబు తన సతీమణి గురించి వ్యాఖ్యలు చేసారంటూ కన్నీరు పెట్టటంతో ఆడపడుచుల గురించి హీనంగా మాట్లాడుతారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారట.నందమూరి కుటుంబం అధికార వైసీపికి హెచ్చరిక చేసిందని సమాచారం.జూనియర్ ఎన్టీఆర్ తో సహా పలువురు ఈ ఘటనను తప్పు బట్టారని తెలుస్తుంది.ఇక, టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పరామర్శించారని తెలుస్తుంది.

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ నేరుగా చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారని సమాచారం.. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారని తెలుస్తుంది.అనంతరం, 'నాకు 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డానని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడాను' అని మైత్రేయన్‌ చెప్పుకొచ్చారట . ఇదే అంశం పైన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి స్పందించారని తెలుస్తుంది
 

శాసనసభలో ప్రతిపక్ష నేతను అవమానపరిచేందుకు ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభా మర్యాదేనా అని ప్రశ్నించారట . అసలు సభలో లేని మరియు సభకు సంబంధమే లేని వ్యక్తుల పర్లు ప్రస్తావిస్తూ చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞతేనా అంటూ నిలదీసారట. అధికారం మరియు సభలో మందబలం ఎప్పుడూ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారట.. మన ప్రవర్తన మరియు హుందాతనమే శాశ్వతమని చెప్పుకొచ్చారట. ఒక ఆడపడుచుపైన అసెంబ్లీ సాక్షిగా అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ప్రస్తుత రాజకీయాల్లో హుందాతనం లోపిస్తోందంటూ రేణుక ఆవేదన వ్యక్తం చేసారని తెలుస్తోంది.
 

ప్రముఖ సినీనటి వాణీ విశ్వనాథ్‌ ఇదే అంశం పైన రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది.చంద్రబాబు శపథం నెరవేరుతుందని ఆయన విజయం తథ్యమని వాణీ విశ్వనాథ్‌ పేర్కొన్నారట స్వార్థ రాజకీయాల కోసం ఉద్దేశపూర్వకంగా కుటుంబ సభ్యులను విమర్శించడం, కుటుంబంలోని మహిళలను అవహేళనగా మాట్లాడ్డం బాధాకరమని వ్యాఖ్యానించారట.ఓ మహిళగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అసెంబ్లీలో ఎన్‌టీఆర్‌ కుమార్తె భువనేశ్వరి అప్రస్తుత మరియు అవమానకర ప్రస్తావన చంద్రబాబు శపథానికి కారణమైందని అన్నారట. వైసీపీ పతనం ఖాయమైందని వాణీ విశ్వనాధ్ వ్యాఖ్యానించ్చినట్లు .తెలుస్తుంది.
 

హీరోలు నారా రోహిత్ మరియు కళ్యాణ్ రాం సైతం ఈ పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేసారని శాసనసభలో ఒక మహిళ గురించి అసభ్యంగా మాట్లాడటం పట్ల వారు వైసీపీ నేతల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారని తెలుస్తుంది.. పార్టీలకు అతీతంగా ఈ పరిణామల పైన పలువురు స్పందిస్తున్నారని అయితే, వైసీపీ మంత్రులు మరియు నేతలు మాత్రం తాము ఎక్కడా చంద్రబాబు సతీమణి గురించి ప్రస్తావించలేదని అసలు ఆ చర్చ రాలేదని చెబుతున్నారట.సభలో వీడియో ఫుటేజ్ సైతం పరిశీలించుకోవచ్చని సూచిస్తున్నారని తెలుస్తుంది.చంద్రబాబు సానుభూతి కోసం ఆడుతున్న డ్రామాగా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: