బ్రేకప్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తీసుకొస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కానీ, వారి వ్యవహార శైలి లో కానీ, పరిస్థితులపై రియాక్ట్ అవ్వడం గాని ఇలా చాలా విషయాల్లో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి.అయితే తాజాగా ఇలాంటి మార్పులు మన అక్కినేని హీరో నాగచైతన్య లో గమనించవచ్చు. చైతు సమంత తో ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.తన వివాహ బంధానికి స్వస్తి పలికిన నాగచైతన్య.. ఆ తర్వాత నుండి కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండని చైతు విడాకుల తర్వాత అయితే అసలు సోషల్ మీడియాలోనే ఎక్కడా కనిపించలేదు.

 అయితే తాజాగా చూస్తే పరిస్థితి మారిపోయింది. మునుపటిలా కాకుండా చైతు తన వ్యవహార శైలిని మార్చుకున్నారు. గతంలో సోషల్ మీడియాలో అయితే అప్పుడప్పుడు మాత్రమే యాక్టివ్గా ఉండే వాడు. అవసరమైనప్పుడు మాత్రమే పోస్టులు పెట్టే వాడు. కానీ ఇప్పుడు చూస్తే చైతు అలా లేడు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఐపోయాడు. ముఖ్యంగా సినిమా ప్రచారానికి సోషల్ మీడియాని చైతు ఫుల్ గా వాడేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన తండ్రితో కలిసి నటిస్తున్నా 'బంగార్రాజు' సినిమా గురించి సోషల్ మీడియా లోనే తండ్రీ కొడుకులిద్దరూ సరదాగా ముచ్చటించారు. నిజం చెప్పాలంటే లవ్ స్టోరీ సినిమా నుండే నాగచైతన్య లో ఈ మార్పు స్టార్ట్ అయింది.

 ఇక బంగార్రాజు సినిమా దగ్గరకు వచ్చేసరికి అది కాస్త ఇంకా ఎక్కువైపోయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రచారంలో భాగంగా తొలుత హీరోయిన్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. అంతే కాకుండా దానికి "టీజర్ నాగలక్ష్మి రేపు చూపిస్తాం" అంటూ ఈ పోస్ట్ ని కూడా పోస్ట్ చేశాడు. దానికి నాగార్జున రిప్లై ఇసస్తూ.. "అంతా ఓకేనా మరి బంగార్రాజు ఎప్పుడు?" అని అడిగారు. దానికి చైతు సమాధానంగా "లేడీస్ ఫస్ట్" అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక దీన్ని చూసిన అభిమానులు.. చైతు మళ్లీ ట్రాక్లోకి వచ్చాడని తెగ ఆనందపడి పోతున్నారు. ఇక మరోవైపు ఒరిజినల్ చైతు ఇలానే ఉంటాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా విడాకుల తర్వాత చేతుల మాత్రం చాలానే మార్పు వచ్చిందని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: