బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైంది కృతి శెట్టి. ఈ సినిమా విడుదలకు ముందే తన అందంతో మెస్మరైజ్ చేసిన కృతి శెట్టి.. ఉప్పెన సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. దీంతో తెలుగుతో పాటు సౌత్ లో ఉన్న అగ్ర దర్శకనిర్మాతలు అందరూ కృతి శెట్టి వెంటపడుతున్నారు. ఆమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఉప్పెన తో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తన రెండవ సినిమా గా నేచురల్ స్టార్ నాని తో 'శ్యామ్ సింగరాయ్' అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.

 రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఓ సినిమా, సుధీర్ బాబు జోడిగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నాగచైతన్య సరసన 'బంగార్రాజు' సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉండడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ అగ్రహీరోల సినిమాలకు ఓకే చెప్పిన కృతి శెట్టి తాజాగా ఈసారి రూటు మార్చి ఏకంగా ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ మధ్యనే నిర్మాతగా మారి జి స్టూడియోస్ వారితో కలిసి పలు వెబ్ సిరీస్ లు, సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా.

 ఈ నేపథ్యంలోనే సుష్మిత వద్దకు ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ రాగా.. ఆ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లో కృతి శెట్టి అయితే బాగుంటుందని ఆమె భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే ఈ కృతి శెట్టితో ప్రస్తుతం సుష్మితా ఈ ప్రాజెక్టు విషయమై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతే కాదు దాదాపు ఈ లేడి ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయం అవుతున్నా అప్పుడే లేడి ఓరియంటెడ్ చిత్రాలకు కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: