నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'అఖండ' ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై  మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించింది. సింహ, లెజెండ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం ఓ రేంజ్ లో రెస్పాన్స్ ని అందుకుంది. 

ఫ్యాన్స్ కి అయితే ఈ ట్రైలర్ ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. అందులో ఒకటి ఆ ఘోర పాత్ర కాగా.. మరొకటి ఫ్యాక్షనిస్టు పాత్ర అని తెలుస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న అఖండ సినిమాను డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ను సైతం వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. నవంబర్ 24వ తేదీన అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతున్న ట్లు సమాచారం. ఇక హైదరాబాదులో నిర్వహించబోతున్న అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా..

 రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ప్రస్తుతం ఎన్టీఆర్ విదేశీ యాత్ర లో ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. దీంతో  ఫ్యాన్స్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇక తాజా సమాచారం ప్రకారం అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ తో పాటు మరో స్టార్ హీరో కూడా గెస్ట్ గా రాబోతున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన నేచురల్ స్టార్ నాని. గతంలో తన సినిమాలో బాలయ్య కు వీరాభిమాని గా కనిపించిన నాని.. ఇటీవల బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకి వచ్చాడు. దీంతో బాలయ్య, నాని ల మధ్య మంచి బంధం ఏర్పడింది. ఈ కారణంగానే బాలయ్య అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాని మరో గెస్ట్ గా రాబోతున్నాడు అనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: