తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి అక్కినేని నాగేశ్వరావు గారు.కానీ కైకాల సత్యనారాయణ ను విమర్శించిన అక్కినేని నాగేశ్వరావు అని ఒక వార్త అప్పట్లో లో ఒక సంచలనం రేకెత్తించింది. అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రముఖ హీరో గా పేరు పొందిన నాగేశ్వరావు గారికి అంతకు కొన్ని రోజుల క్రితం తనకు హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక మంచి కథ ఉంటే నేను సినిమా చేయాలి లేకపోతే ఖాళీగా ఉండాలి అని అనుకున్నారు.

తను అనుకున్న విధంగానే ఒక మంచి కథ దొరికింది. అందుకు ఆ  సినిమాను తానే స్వయంగా నిర్మించాలని అనుకున్నారు. ఈ సినిమాలో ఒక ఈ పాత్ర చేయడానికి  కైకాల సత్యనారాయణ గారు కూడా ఒప్పుకున్నారు. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి మరియు నాగేశ్వరావుగారి  కాంబినేషన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరావు గారు మరియు శ్రీదేవిహీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు చక్రవర్తి సంగీతదర్శకుడిగా పని చేశారు.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ఒక దశలో హీరోయిన్ శ్రీదేవి గారు అదే సమయంలో ఇంకొక సినిమాకు పని చేస్తున్న కారణంగా ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని అనుకున్నారు.


ఈ విషయాన్ని దర్శకుడు అక్కినేని నాగేశ్వర రావు గారికి కైకాల సత్యనారాయణ గారికి మరియు ఇతర సినిమా బృందం మొత్తానికి తెలిపారు. కైకాల సత్యనారాయణ గారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే 6 గంటల లోపు దర్శకుడు, అక్కినేని నాగేశ్వరావు గారు. హీరోయిన్ శ్రీదేవి గారు కూడా వచ్చారు. కానీ సత్యనారాయణ గారు రాలేదు. 8 అయిన రాకపోవడంతో నాగేశ్వరావు గారికి ఎంత కోపం వచ్చింది. తర్వాత వచ్చిన సత్యనారాయణ గారి పై నాగేశ్వరావు గారు కోపంతో మండిపడ్డారు.కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండలేదు నాగేశ్వరరావు గారికి తర్వాత ఆయనే వెళ్లి కైకాల గారితో వెళ్లి మాట్లాడారు. కొంతసేపటి తర్వాత షూటింగ్ మొదలు పెట్టి త్వరగా పూర్తి చేశారు. ఆ సినిమా పేరు శ్రీరంగనీతులు. ఈ సినిమా 1983 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా తమిళ చిత్రం కు రీమేక్.

మరింత సమాచారం తెలుసుకోండి: