నేషనల్ క్రష్ రష్మిక మందన నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం లో తెరకెక్కిన చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు రష్మిక అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా ఆఫర్లు కూడా దక్కాయి. అందులో భాగంగా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, దేవ్ దాస్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ప్రస్తుతం కూడా రష్మిక మందన అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా రష్మిక మందన హీరోయిన్ నటిస్తోంది.

ఇలా తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తున్న రష్మిక మరో అదిరిపోయే సినిమా ఛాన్స్ ను కొట్టేసినట్టు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళ్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారు పాట సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా పూర్తయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో  మహేష్ బాబు హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే ను హీరోయిన్ గా చిత్ర బృందం కన్ఫామ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరొక హీరోయిన్ గా రష్మిక మందన ను తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త కనుక నిజమే అయితే రష్మిక మందన మరో క్రేజీ సినిమా ఆఫర్ ను కొట్టేసినట్టే. ఇప్పటికే రష్మిక మందన సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: