పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వం లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి, ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రముఖ పాత్ర లో నటించబోతున్నాడు. ఈ సినిమా లో ప్రభాస్ కు జంటగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటించనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది, ప్రాజెక్ట్ కే సినిమా సంగీత దర్శకుడు మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక చిన్న షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు అగ్ర దర్శకులు సింగీతం శ్రీనివాస్ క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నాడు, ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ముందు మిక్కీ జె మేయర్ ను చిత్రబ్బృందం తీసుకున్నారు, ఇప్పుడు అతని ప్లేస్ లో సంతోష్ నారాయణన్ ను చిత్ర బృందం తీసుకునే ప్లాన్ లో ఉన్నట్లు ఒక టాక్ వినిపిస్తుంది. సంతోష్ నారాయణన్ తమిళంలో సూపర్ హిట్ సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశాడు, రజనీకాంత్ హీరో గా తెరకెక్కిన కాలా, కబాలి సినిమాలకు ఈ సంగీత దర్శకుడే సంగీతం సమకూర్చాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ కే లో ఈ సంగీత దర్శకుడు బాగా స్థానం కానున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాదే శ్యామ్,  సలార్, ఆది పురుష్ సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. మరియు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో స్పిరిట్ అనే మూవీ లో నటించడానికి కూడా ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: