ఇదిలా ఉంటే మహెష్ బాబు రాజమౌళి కాంబో అంటేనే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. ఇక ఈ ఇద్దరు కలసి చేసేది పాన్ ఇండియా లెవెల్ మూవీ. అంతే కాదు, దానికి జంగిల్ బ్యాక్ డ్రాప్ కధ అని కూడా ప్రచారం అవుతోంది. మొత్తానికి ఒక్కటి మాత్రం నిజం. మహేష్ బాబుతో మామూలు సినిమా అయితే రాజమౌళి తీయడు. కచ్చితంగా కొత్త జానర్ లోనే వెళ్తాడు. పైగా మహష్ ని ఎలా చూపిస్తే ఆడియన్స్ కి కిక్ వస్తుంది అన్నది చూసుకునే తీస్తాడు.
దీంతో ఈ మూవీ కోసం రాజమౌళి కసరత్తు మొదలెట్టాడని అంటున్నారు. హీరోయిన్ గా సమంతను తీసుకుంటారని టాక్ అయితే బయటకు వచ్చింది. ఇపుడు విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ని తీసుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. విక్రమ్ అపరిచితుడుతో ఎంత పెద్ద హిట్ కొట్టాడో తెలిసిందే. ఆయనకు తెలుగులో కూడా సూపర్ లెవెల్ లో ఫ్యాన్స్ ఉన్నారు. కమల్ హాసన్ తరువాత వైవిధ్యమైన పాత్రలు పోషించడానికి ఎపుడూ విక్రమ్ తయారుగా ఉంటారని చెబుతారు. పాత్రలోకి వెళ్తే పరకాయ ప్రవేశమే అని విక్రమ్ కి పేరు. దాంతో విక్రమ్ రాజమౌళి సినిమాలో విలన్ అంటే అదరగొట్టుడు ఖాయమే. పైగా అటు మహేష్ బాబు ఇటు విక్రమ్ అంటే ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పటి నుంచే అంచనాలు మించుతున్నాయి. చూడాలి మరి దీని మీద అధికార ప్రకటన రావాలి.