ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఉప్పెనంత అభిమానులను సొంతం చేసుకుంది హీరోయిన్ కృతి శెట్టి. తొలి సినిమాతోనే ఇంతటి స్థాయిలో క్రేజ్ అందుకుంది అంటే ఆమెకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉప్పెన సినిమా అందరికంటే ఎక్కువగా ఈమెకే ఎక్కువగా వర్కవుట్ అయ్యింది. ఈ సినిమా విడుదల కాకముందే ఆమెకు మంచి మంచి హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది అంటే ఆమెకు ఏ రేంజ్ లో డిమాండ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఆమె నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత కూడా ఆమె తీసుకొనే టాప్ హీరోయిన్ అయ్యే విధంగా దూసుకుపోతుంది. అయితే ఆమె కెరీర్ లో  అతి తక్కువ సమయంలోనే ఇప్పుడు ఓ పని చేయబోతుంది కృతి శెట్టి. ఏ హీరోయిన్ అయినా తమ కెరీర్ ఎండింగ్ లోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలు పెడతారు. ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లు కూడా ఆ విధంగానే చేశారు. 

కానీ కృతి శెట్టి తన కెరియర్ ప్రారంభ దశలో ఉండగానే లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తు ఉండడం ఇప్పుడు అందరిలో ఒక్కసారిగా ఆసక్తి ను పెంచుతుంది. ఇటీవలే ఓ దర్శకుడు చెప్పిన లేడీ ఓరియంటెడ్ సినిమా కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. రామ్ సరసన లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటిస్తున్న ఈమె ఆ చిత్రం తర్వాత ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో చేయబోతోందని తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కు దక్కని అదృష్టం ఆమెకు దక్కింది. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఆమె ఇప్పుడు వరుస మంచి చిత్రాలను చేసుకుంటూ పోతూ నెంబర్ వన్ హీరోయిన్ అయ్యే దిశగా దూసుకుపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: