హీరోయిన్లు ఎక్కువ శాతం మోడలింగ్ రంగం నుండి వస్తూ ఉంటారు. ఆ రంగం నుండి వచ్చి సినిమా ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉన్న వారిని మనం ఎంతో మందిని చూశాం.  అయితే మోడలింగ్ రంగం నుండి కాకుండా డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని, ఆ విధంగా సినిమా రంగంలోకి వచ్చి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో సాయిపల్లవి ఒకరు. సాయి పల్లవి డాన్స్ పర్ఫామెన్స్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఎంతో సున్నితమైన ప్రేమ కథలో చిన్న చిన్న ఇగోస్, మనస్పర్ధలు రావడం వల్ల ప్రేమ జంట ఎదుర్కొనే సమస్యల తో ఈ సినిమాను శేఖర్ కమ్ముల చిత్రీకరించాడు.

ఈ సినిమాలో సాయి పల్లవి అందచందాలకు, నటనకు, మరీ ముఖ్యంగా డాన్స్ లకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇలా టాలీవుడ్ లో తాను నటించిన మొదటి సినిమా తోనే ఎంతో మంది ప్రేక్షకుల మన్ననలను పొందింది. అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా సాయి పల్లవి కి దక్కాయి. ఇలా మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సాయి పల్లవి ఆ వెంటనే నాని హీరో గా తెరకెక్కిన ఎం సి ఎ సినిమాలో నటించి మరొక విజయాన్ని అందుకుంది. ఎక్కువగా గ్లామర్ పాత్రలకు ప్రాముఖ్యత ఇవ్వని ఈ ముద్దుగుమ్మ తనకు నచ్చే, ఇష్టపడే సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతుంది. అయితే కొన్ని రోజుల క్రితం విడుదలైన లవ్ స్టోరీ  సినిమాతో కూడా సాయి పల్లవి జనాలను అలరించింది. ప్రస్తుతం కూడా సాయి పల్లవి పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: