కృతి శెట్టి, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది, ఉప్పెన సినిమా విడుదల కాకముందే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమా విడుదల తరువాత కూడా అదే రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. ఇలా అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం శామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం మరియు రామ్ పోతినేని సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా హీరోయిన్ నటించిన ఒకే సినిమాతో ఎన్నో సినిమాల అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

 మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాణ రంగంలో ప్రవేశించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆమె ఒక వెబ్ సిరీస్ ను కూడా నిర్మించింది. ఇది ఇలా ఉంటే ఆమె నిర్మాణ సంస్థ నుండి పలు వెబ్ సిరీస్ లతోపాటు సినిమాలు కూడా రానున్నట్లు తెలుస్తోంది. వెబ్ సిరీస్ లను మరియు సినిమాలను నిర్మించేందుకు సుష్మిత ఒక టీం ను  కూడా ఏర్పాటు చేసుకుందట. సుష్మిత ఏర్పాటుచేసిన టీం తాజా గా ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ను రెడీ చేసిందట, ఈ కథ తో మొదట సినిమా తీయాలని సుష్మిత ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కథకు కృతి శెట్టి అయితే బాగుంటుంది అని సుష్మిత భావించడం ,ఆ వెంటనే కృతి శెట్టి కి కథను వినిపించడం, దానికి కృతి శెట్టి ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందట. మరి ఈ విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: