మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా లలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే , ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాతో పాటు మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లోను చిరంజీవి పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమా లతో పాటు తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా లో చిరంజీవి నటిస్తున్నాడు, ఈ సినిమా లో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండ గా, కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు గా నటిస్తోంది. ఈ సినిమా లతో  పాటు బాబీ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించేందుకు మెగాస్టార్ చిరంజీవి రెడీ గా ఉన్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

ఇలా ఇప్పటికే వరుస క్రేజీ సినిమా లను  లైన్ లో పెట్టిన చిరంజీవి,  వెంకీ కుడుముల దర్శకత్వం లో కూడా ఒక సినిమా లో నటించబోతున్నాడు అంటూ అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే చలో, భీష్మ వంటి రెండు విజయా లతో మంచి ఫామ్ లో ఉన్న ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి కి కథ ను వినిపించాడు అని, ఆ కథకు చిరంజీవి కూడా ఓకే చెప్పాడు అని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు అని, ఆ సినిమా లో నేషనల్ క్రాష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతోంది అని ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: