అలాగే ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుడు అజయ్ భూపతికి కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి రికార్డును సృష్టించింది. శివ పాత్ర కు ప్రాణం పోసిన కార్తీకేయ...చిత్రంలో చూపిన వేరియేషన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక పాయల్ ఈ మూవీకి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. గ్లామర్ తోనే కాదు, అందమైన నటనతో ఆడియన్స్ ని కవ్వించే తన నటనతో అభిమానులుగా మార్చుకుంది. అలా టాలీవుడ్ కి ప్రతిభావంతులైన మరో ఇద్దరు హీరో, హీరోయిన్లు లభించారనే చెప్పాలి. సరైన పాత్రలను ఎంపిక చేసుకోవాలి కానీ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడానికి అవకాశం చాలానే ఉంది అని అంతా అనుకున్నారు.
ఇద్దరు కూడా వారి వారి కెరియర్ లో బిజీ అయ్యారు. ఆఫర్లు అందుకున్నారు. కానీ rx 100 తర్వాత ఆ స్థాయి గుర్తింపును మాత్రం ఇప్పటి వరకు దక్కించుకోలేక పోయారు. దీనికి వారు ఎంచుకుంటున్న కథలే కారణమా లేదా కథలు బాగుంటున్నా సరిగా తెరకెక్కించలేని డైరెక్టర్ ల పొరపాటా? అన్నది వారే ఆలోచించుకోవాలి. కార్తికేయ అయితే వరుస పెట్టి సినిమాలు తీస్తున్నా హిట్ ను అందుకోలేక తడబడుతున్నాడు. అంతే కాకుండా RX 100 డైరెక్టర్ అజయ్ భూపతి సైతం మహాసముద్రంతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. మళ్ళీ ఈ సూపర్ హిట్ కాంబో జత కలిసి హిట్ కొడతారా అన్నది చూడాలి.