మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటిస్తుండగా, అజయ్ దేవగన్, సముద్ర కని ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది,  ఇప్పటికే జనాలలో ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

ఇలా సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించారో, అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేయాలి అని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4 వ తేదీ నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇండియా లోని ప్రధాన న‌గ‌రాల‌న్నింటికీ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక  చార్టెడ్ ఫ్లైట్‌ ను అద్దెకు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై పాన్ ఇండియా రేంజ్ లో జనాల్లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే టాలీవుడ్ టాప్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒకే సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఇది ఇలా ఉంటే మూడు గంటల పైగా పూటేజీ ఉన్న ఈ సినిమాను 2 గంటల 45 నిమిషాల వరకు రాజమౌళి తగ్గించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4 వ తేదీ వరకు సినిమా పనులన్నీ ముగించుకొని ప్రమోషన్ లను ప్రారంభించాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: