తొలి రెండు చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యువ దర్శకుడు వెంకీ కుడుముల. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ఛలో బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అయ్యి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో ఆయన తన తదుపరి సినిమాను చేయడం మొదలు పెట్టి దాన్ని కూడా సూపర్ హిట్ చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆయనకు టాలీవుడ్ లో భారీ డిమాండ్ నెలకొంది అని చెప్పవచ్చు. నితిన్ తో కలిసి ఆయన భీష్మ అనే సినిమా చేయగా సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కష్టాల్లో ఉన్న నితిన్ కు కూడా ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడగా చాలా మంది దర్శకులు ద్వితీయ విఘ్నం దాటలేక  ఫెయిల్ అవుతూ ఉండడం తో ఈ దర్శకుడు ద్వితీయ విగ్నాన్ని సక్సెస్ తో దాటించడం అందరినీ ఎంతగానో సంతోష పెట్టింది. ఇక ప్రస్తుతం ఆయన తన మూడవ సినిమాను ఓ స్టార్ హీరోతో చేసే పనిలో పడ్డారు. మొన్నటిదాకా రామ్ చరణ్ తో ఆయన తన తదుపరి సినిమా చేయనున్నాడు అని వార్తలు హల్ చల్ చేశాయి. కానీ రామ్ చరణ్ భారీ పెద్ద దర్శకులతో మాత్రమే సినిమాలు చేయడంతో ఇప్పుడు ఆయన మరో హీరోను వెతుక్కునే పనిలో పడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన మెగాస్టార్ చిరంజీవి తో కలసి ఓ ఫోటో దిగగా అప్పుడే ఆయనకు ఓ కథ చెప్పాడని, అది కూడా మెగాస్టార్ కి ఎంతగానో నచ్చిందని వెంటనే ఆ సినిమా పనులను మొదలు పెట్టాలని సూచించాడని ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి దాకా చిన్న హీరోలతో చేసిన ఆయన ఇప్పుడు తన మూడవ సినిమా మెగాస్టార్ తో చేయడం నిజంగా ఒక పెద్ద అచివ్మెంట్ అని చెప్పాలి. మరి మెగాస్టార్ తో ఆయన చేసే సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీసు వద్ద విజయం సాధిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: