రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన రెండు సినిమాలను విడుదల చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఆచార్య సినిమాను కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కాబోతు ఉండగా ఈ చిత్రానికి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు. దీని తర్వాత కూడా ఆయన మాస్ ప్రేక్షకులను కుటుంబ ప్రేక్షకులను యూత్ ను బాగా అలరించే సినిమాలను చేస్తున్నాడు.

ఇటీవలే ఆయన ఒప్పుకున్న మూడు సినిమాలను మొదలు పెట్టే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం లో గాడ్ ఫాదర్ సినిమాను మొదలు పెట్టగా ఇటీవల మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భోళా శంకర్ కూడా మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ లను పూర్తి చేయనున్నాడు. ఇక బాబీ దర్శకత్వంలో సినిమా ను కూడా వచ్చే నెలలో మొదలు పెట్టాలని చిరంజీవి ఇప్పటికే సూచనలు చేశాడు. ఓ మంచి రోజు చూసి ఈ చిత్రాన్ని భారీగా లాంచ్ చేయబోతున్నారు.  

అయితే గతంలో ఒక సినిమా చేస్తున్నప్పుడు మరొక సినిమా జోలికి పోని చిరంజీవి ఇప్పుడు ఏకకాలంలో మూడు సినిమాలను చేయడానికి సిద్ధమవుతూ ఉండడం పట్ల మెగా అభిమానులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్న మరొకవైపు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు చిరంజీవి ఈ విధంగా వరుసగా సినిమాలను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు అని వారు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి ఈ మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతుండగానే మరొక రెండు మూడు సినిమాలను ఒప్పుకునే విధంగా యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. మెగాస్టార్ లో ఈ మార్పుకు అభిమానులే కాదు ప్రేక్షకులు సైతం ఎంతో సంతోష పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: