ప్రభాస్ హీరోగా ప్రస్తుతం చాలా సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ఆయన హీరోగా చేసిన రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఆ తర్వాత కూడా ఆయన భారీ చిత్రాలను సెట్ చేసుకున్నాడు. వీటిలో దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్న సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రాజెక్ట్ కే. ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ కా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను భారీగా అలరించే విధంగా ఉండబోతుందని అంటున్నారు.

దానికి తగ్గట్లే భారతదేశంలోని అగ్రతారలు ఈ సినిమాలో నటించబోతున్నారు. అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకొనే నటిస్తుండటం విశేషం. బాలీవుడ్ లో వీరికి మంచి క్రేజ్ ఉండగా ప్రపంచవ్యాప్తంగా కూడా హీరోయిన్ దీపికా పడుకొనే కు మంచి ఇమేజ్ వుంది. ఆమె ఇటీవలే కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటించగా అక్కడ కూడా భారీ గా అభిమానులను ఏర్పరుచుకుంది. వాటితో వచ్చిన ఆ ఇమేజ్ తోనే ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్రబృందం.

ఇక ఏ సినిమా అయినా ప్రేక్షకులకు బాగా దగ్గరవ్వాలి అంటే అన్ని అంశాలు బాగుండటంతో పాటు సినిమాకు అందించే మ్యూజిక్ కూడా ఎంతో బాగుండాలి. ఏ సినిమా విజయాన్ని అయినా నిర్ణయించేది సంగీతమే. చాలా సినిమాల్లో కథ బాగా లేకున్నా కూడా సంగీతం బాగుంటే ఆ చిత్రాలు హిట్ అవుతాయి. కథ బాగుండి సంగీతం లేకున్నా ఆ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పెద్దగా పొందలేకపోయాయి ఆ విధంగా ప్రాజెక్టు ఏ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడని మొదట్లో అనౌన్స్మెంట్ చేయగా ఇప్పుడు కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వాళ్ళ ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని తెలుస్తుంది ఆయన స్థానంలో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: