స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కంటెంట్ ఉన్న దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తొలి సారి ఐకాన్ స్టార్ ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. అందుకే ఫ్యాన్స్ తమ అభిమాన తార సరి కొత్త యాంగిల్ ను చూడటానికి మరింత ఉత్సాహం కనబరుస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించనున్న విషయం తెలిసిందే. కాగా పార్ట్ 1.. 'పుష్ప ది రైజ్' పేరిట డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే ఈ సినిమా స్థాయిని మరింత పెంచేందుకు ఈ చిత్రంలో రష్మికాకు సంబందించిన ఒకటి, రెండు కీలక సన్నివేశాలను అదనంగా యాడ్ చేయ బోతున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలు ఇంటర్వెల్ కు ముందు ఉంటాయని తెలుస్తోంది. మరి ఆ సీన్ లు ఏమిటో? ఎందుకు అదనంగా సీన్ లు కలుపుతున్నారో అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే. అయితే రిలీజ్ డేట్ ను మాత్రం మార్చకుండా చెప్పిన డేట్ కే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య పుష్ప సినిమా రిలీజ్ డేట్ మారిందని, ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉన్నందున మూవీ రిలీజ్ డేట్ ని మార్చినట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం లేట్ అయ్యే ఛాన్సే లేదని అనుకున్న డేట్ కి అల్లు అర్జున్ వేటాడేందుకు వచ్చేస్తున్నారు అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇంకేముంది ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఇక ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి మును ముందు ఈ భారీ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. ఇందులో ఎంత నిజం ఉందో త్వరలో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: