కరోనా కల్లోలం తర్వాత సినిమా పరిశ్రమ మరింత ఊపుతో ముందుకు వెళ్తోందని తెలుస్తుంది.కొత్త జోష్ తో పలు సినిమాల శరవేగంగా తెరకెక్కుతున్నాయని సమాచారం.. పెండింగ్ సినిమాలు సైతం అంతే వేగంగా కంప్లీట్ అవుతున్నాయని తెలుస్తుంది.

విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయని సమాచారం.టాలీవుడ్ నుంచి దేశం అబ్బుర పడే సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయని తెలుస్తుంది.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లకు వచ్చేందుకు వేగంగా పనులు పూర్తి చేసుకుంటున్నాయట. ఇప్పటికే వందకు వంద శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు జనాల ముందుకు వచ్చాయని తెలుస్తుంది.. సినిమా మేకర్స్ కూడా భారీ స్థాయిలో సినిమా రిలీజులను ప్రకటిస్తున్నారని తెలుస్తుంది.

వచ్చే డిసెండర్, జనవరి నెలల్లో భారీ పాన్ ఇండియన్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయట.ఇప్పటికే మస్త్ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాలు రిలీజ్ డేట్లను కూడా ప్రకటించాయని తెలుస్తుంది.. పుష్ప, శ్యామ్ సింగ రాయ్, ఆర్ఆర్ఆర్ అలాగే రాధేశ్యామ్ సినిమాలు పాన్ ఇండియా రేంజిలో రిలీజ్ అవుతున్నాయని సమాచారం.

ఇప్పటికే పోస్టర్స్ తో పాటు వీడియో పాటలు విడుదల అయ్యాయని తెలుస్తుంది.ఈ క్రేజీ సినిమాలకు సంబంధించి వచ్చే వారం అదిరిపోయే అప్ డేట్స్ వస్తున్నాయని సమాచారం..

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ థర్డ్ సింగ్ అలాగే ప్రభాస్ మూవీ రాధే శ్యామ్ సెకెండ్ సింగిల్ అదేవిధంగా బాలయ్య-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ సినిమాకు సంబంధించి మూడో పాట రాబోతుందని తెలుస్తుంది.. అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా పుష్ప ట్రైలర్ ప్రకటన కూడా వచ్చేవారంలో రానుందట.మొత్తంగా డిసెంబర్ నెల అంతా ఫ్యాన్స్ కు పండగ వాతావరణం రానుందని సమాచారం . పలు సినిమాలు వరుసబెట్టి విడుదల అయ్యే అవకాశం ఉందట.మొత్తంగా డిసెంబర్ మొదలుకొని జనవరి వరకు తెలుగు సినిమా పరిశ్రమ కొత్త సినిమాల విడుదలో మరింత జోష్ నింపుకోనుందని తెలుస్తుంది.. కరోనా తర్వాత ఫ్యాన్స్ ఓ రేంజిలో ఎంటర్ టైన్ మెంట్ అందుకునేందు రెడీ అవుతున్నారట ఇంతకీ ఏ సినిమా జనాలను ఏ రేంజిలో ఆకట్టుకుంటుంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: