లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య కు ముద్దుల వర్షం కురిపించింది సాయిపల్లవి. అయితే ఈ ముద్దుల వెనుక ఉన్న అసలు కథను బయట పెట్టింది సాయి పల్లవి. ఆ సీన్లో ఎలా చేశామో, వాటి గురించి వివరించింది. అసలు వీరిద్దరి మధ్య ఏముందో కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.



అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా" లవ్ స్టోరీ". ఈ సినిమాలో నాగచైతన్య తో బాగా చిందులేసింది సాయి పల్లవి. ఈ సినిమాకే  సాయి పల్లవి అట్రాక్షన్గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం తన డాన్స్ తో, తన అందంతో బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను.ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేసింది.


ఈ సినిమాలో అక్కడక్కడా కొన్ని రొమాన్స్ సన్నివేశాలు, యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఇందులోని కొన్ని సన్నివేశాలు, యాక్షన్ సీన్లు బాగా అద్భుతంగా తెరకెక్కించ బడ్డాయి. ఎప్పుడూ చిన్న హీరోలతోనే ఇలాంటి ప్రయోగం చేస్తూ ఉంటాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి చర్చల్లో నిలిచిన అంశం ఏమిటంటే సాయి పల్లవి నాగచైతన్య కు నిజంగానే ముద్దు పెట్టిందా అనే విషయం బాగా వైరల్ గా మారింది.


ఇలాంటి సీన్లు అంటే ఎప్పుడూ దూరంగా ఉంటుంది సాయి పల్లవి. ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశానికి ఎలా ఓకే చెప్పిందని అందరూ భావించారు. అయితే ఈ విషయంపై సాయిపల్లవి పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. తాను నాగచైతన్యను కిస్ చేయలేదని చెప్పింది. ఇప్పటివరకు ఇలాంటి సన్నివేశాలులో నేను నటించలేదు. అందుచేతనే శేఖర్ కమ్ముల కూడా నాకు ఇబ్బంది పెట్టలేదని తెలిపింది.. స్టోరీ ప్రకారం ఆ సన్నివేశం ఉండాలి కాబట్టి, కెమెరామెన్ ట్రిక్ తో ఆ సన్నివేశం చేశారని తెలిపింది. ఇకపై కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించనని తెలిపింది. ఇక అంతే కానీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పేసింది. ఇదంతా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది సాయిపల్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి: