మెగా స్టార్ చిరంజీవి మంచి నటుడు మాత్రమే కాకుండా వంటలు చేయడంలో చాల ప్రావీణ్యత ఉన్న వ్యక్తి. చిరంజీవి దోసెలు వేయడంలో చాల నిష్ణాతుడు దీనితో చిరంజీవికి గౌరవాన్ని కల్గించే విధంగా ‘చట్నీస్’ రెస్టారెంట్ లో చిరంజీవి పేరిట రకరకాల దోసెలను తమ మెనూ కార్డులో యాడ్ చేసుకుని ఫుడ్ లవర్స్ కు నిరంతరం చిరంజీవి గుర్తుకు వచ్చే విధంగా చేస్తున్నారు.


అమెరికా లాంటి దేశాలలో కూడ అనేక రెస్టారెంట్ లలో చిరంజీవి పేరిట రకరకాల దోసెలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంలో క్రేజీ బ్యూటీ రష్మిక కూడ ఒక ముందడుగు వేసి తన పేరున కూడ ఒక ఫుడ్ ఐటమ్ క్రియేట్ అయ్యేలా చేసుకోవడం ఏకంగా మెగా అభిమానులకే షాక్ ఇచ్చే విషయంగా మారింది. ఒక ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రష్మిక ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తన పేరుతో క్రియేట్ చేసిన ఫుడ్ ను టేస్ట్ చేస్తూ రకరకాల భంగిమలతో వీడియోలను షూట్ చేయించి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు ప్రచారాన్ని కొనసాగిస్తోంది.


దీనికోసం రష్మికకు భారీగా పారితోషికం ఇచ్చారు అని తెలుస్తోంది. సాధారణంగా ఒక టాప్ హీరో పేరుతో ఫుడ్ ఐటమ్స్ క్రియేట్ చేయడం ఇప్పటివరకు కొనసాగిన పద్ధతి. అయితే దీనితీరుకు భిన్నంగా ఇప్పుడు ఒక హీరోయిన్ పేరిట ఒక ఫుడ్ ఐటమ్ ను క్రియేట్ చేయడం దక్షిణ భారత సినిమా రంగంలో ఇదే మొదటిసారి. గతంలో చిరంజీవి పేరుతో ఉన్న దోసెలను అమెరికాలోని తానా మహాసభల మెనూ లో చేర్చారు.


అలాగే పెద్దపెద్ద పెళ్ళిళ్ళలో కూడ చిరంజీవి దోసెలు కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు రానున్నరోజులలో ‘రష్మిక మీల్’ కూడ అనేక ఫంక్షన్స్ కు సంబంధించిన మెనూ లిస్టులో కనిపించినా ఆశ్చర్యం లేదు. ‘పుష్ప’ ఘన విజయం సాధిస్తే రష్మిక దక్షిణాది సినిమా రంగంలో నెంబర్ వన్ అవ్వడం ఖాయం అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: