ఇక కుర్ర హీరోయిన్లతో జతకట్టి బాగా అలరిస్తున్నాడు చిరంజీవి. వచ్చే ఏడాది ఒకేసారి మూడు సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గా సమాచారం. చిరంజీవి ఎంత వయస్సు వచ్చినప్పటికీ కూడా వరుస సినిమాలలో దూసుకుపోతున్నాడు అనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఆచార్య సినిమా సంబంధించి షూటింగ్ ను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక 2023 వరకు చిరంజీవి డేట్ ఖాళీగా లేవని సమాచారం కూడా బాగా వినిపిస్తోంది.
చిరంజీవి యువ దర్శకులను సైతం వారి మీద ఉండే నమ్మకం మీద సినిమా అవకాశాలు కూడా ఇచ్చాడు. భీష్మ సినిమా డైరెక్టర్ వెంకట్ కుడుముల కూడా డైరెక్షన్లో ఒక మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డైరెక్టర్ చెప్పిన స్టోరీ బాగా నచ్చిందట చిరంజీవికి. ఇక అసలు విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ డైరెక్టర్ తీసిన రెండు సినిమాలో రష్మికనే హీరోయిన్ గా నటించడం విశేషం. అందుచేతనే వెంకీ కుడుముల ఎలా చెబితే రష్మిక అలా చేస్తుందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త బాగా సంచలనంగా మారుతోంది. ఈ వార్తలు నిజము అవ్వాలని చిరంజీవి అభిమానులు కోరుకుంటున్నారు.