ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేక్షకులందరికీ వినూత్నమైన ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ప్రతి సీజన్ కూడా టాప్ రేటింగ్ చేసుకుంటూ  దూసుకుపోతుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎంతో మంది  సినీ సెలబ్రిటీలను కంటెస్టెంట్ గా లోపలికి పంపించడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్ లు 100 రోజుల పాటు హౌస్లో ఉండాల్సి ఉంటుంది. హౌస్ లో ఏ కంటెస్టెంట్ లు కొనసాగాలి అన్న విషయం అటు బయట ఉన్న ప్రేక్షకుల చేతిలో ఆధారపడి ఉంటుంది.


 బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు ఓట్లు వేసి మద్దతు తెలుపుతూ ఉంటారు బయట నుంచి ప్రేక్షకులు. అయితే ఇక అందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి ఎవరికీ తెలియని విషయాలను తెలుసుకోవడానికి బిగ్బాస్ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. ఇక బిగ్బాస్ కార్యక్రమము ప్రస్తుతం అన్ని భాషలలో కూడా ప్రసారం అవుతూ ఉంది. కాగా ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున హోస్టింగ్ చేస్తూ ఉండగా తమిళ్ బిగ్ బాస్ కార్యక్రమానికి విలక్షణ నటుడు కమలహాసన్ హోస్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇటీవల తమిళ బిగ్ బాస్ హోస్ట్ కమలహాసన్ కరోనా వైరస్ బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే.


 వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇక కమల్ హాసన్ కరోనా వైరస్ బారిన పడటంతో ఇక తమిళ బిగ్ బాస్ హౌస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే కమల్ హాసన్ వారసురాలు శృతి హాసన్ బిగ్ బాస్ హోస్ట్ గా రాబోతుంది అనే  టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్న కమల్ హాసన్ మరో రెండు వారాల పాటు బిగ్బాస్ కార్యక్రమానికి దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా కమల్ హాసన్ శ్రుతి హాసన్ ను బిగ్ బాస్ హోస్ట్ గా మార్చాలని అటు నిర్వాహకులు భావిస్తున్నారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: