యువ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం హాకీ క్రీడా ప్రధాన నేపథ్యంగా ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇలా వరుస సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో ప్రస్తుతం మైఖేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ ,మలయాళం, మరియు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు.

 అయితే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతోంది ఎవరా అనేది తాజాగా చిత్ర బృందం రివీల్ చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాబ్లో విలన్ గా కనిపించబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది. మైఖేల్ సినిమా లో విలన్ పాత్రలో నటించాడని గౌతమ్ మీనన్ ను స్వాగతించడానికి చాలా సంతోషిస్తున్నాము అని చిత్రం బృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ సందర్భం గా చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో గౌతమ్ మీనన్ మొఖం కనబడకుండా చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ జనాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ పోస్టర్ లో రక్తం కారుతున్న చేతికి బేడీలు వేసి ఉండడాన్ని గమనించవచ్చు. దీనిని బట్టి  గౌతమ్ మీనన్మూవీ లో చాలా పవర్ఫుల్ విలన్ గా కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ కథలను మరియు యాక్షన్ సినిమాలను అద్భుతం గా తెరకెక్కించే గౌతమ్ మీనన్ ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: