మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు, ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన న రామ్ చరణ్ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను పెంచుకోవాలి అనుకుంటున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రామ్ చరణ్ మరో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ నటిస్తోంది, ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటోంది, ఇలా ఒక పాన్ ఇండియా సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ 'జెర్సీ' సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడు, ఈ దర్శకుడు ప్రస్తుతం జెర్సీ సినిమాను బాలీవుడ్ లో  రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ 'కేజిఎఫ్' సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో తన క్రేజ్ ను పెంచుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: