రామ్ చరణ్ హీరోగా
శంకర్ కాంబినేషన్ లో
దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం పై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ
సినిమా విడుదల కాబోతుండగా
దిల్ రాజు ఈ
సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా ఈ
సినిమా యొక్క శాటిలైట్ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించారని సమాచారం. దీంతో
దిల్ రాజుకు ఈ
సినిమా మీద మరింత పెట్టుబడి పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజమౌళి మాత్రమే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా భారీగా సినిమాలను చేస్తూ రాగా ఆ సినిమాలు అంతటి వసూళ్లు రాబట్టుకోవడానికి చాలా ప్రమోషన్స్ చేస్తాడు. ఇప్పుడు ఆయన తర్వాత ఇప్పుడు ఈ సినిమాను అంతటి స్థాయిలో
దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. ఈ మధ్య కాలంలో అసలు
సక్సెస్ లేని
శంకర్ ను నమ్మి ఈ సినిమాను ఇంత బడ్జెట్ తో తెరకెక్కిస్తు ఉండడం అందరినీ ఎంతగానో కలవరపరుస్తోంది. దానికి తోడు చరణ్ ఈ సినిమాలో హీరోగా నటించడం మెగా అభిమానులను మరింతగా కలవర పరుస్తోంది.
ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ ఫామ్ లోకి రావాలని
శంకర్ భావిస్తున్నాడు. ఇటు చరణ్ కూడా తన పాన్
ఇండియా సినిమా జోష్ ను ఈ
సినిమా తో కొనసాగించాల ని భావిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ
సినిమా భారీగా అభిమానులను అంచనాలను అందుకుంటుంది. ఈ
సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్న ఆశతో చిత్ర యూనిట్ ఉంది.
హీరోయిన్ గా కియర అద్వానీ నటిస్తున్న ఈ
సినిమా యొక్క శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ 350 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో యూనిట్ తెలియజేయాల్సి ఉంది.