యావత్ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా సినిమా ఏదైనా ఉందా అంటే అది రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్'  అనే చెప్పాలి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినీ తారలు కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటుంది. సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక అప్డేట్ కూడా భారీ రికార్డులను క్రియేట్ చేసి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన 'నాటు నాటు' అనే పాట దుమ్ము రేపుతోంది.

 ఈ పాటకి ప్రేక్షకలోకం మొత్తం మాస్ స్టెప్పులేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి వేసే స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పాటలో హీరోలిద్దరూ స్టెప్స్ స్పీడ్ గా ఉన్నాయి అని చాలామంది కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఏకంగా యూట్యూబ్ ఇండియా కూడా ఈ పాటలో స్పీడ్ స్టెప్స్ పై తనదైన శైలిలో కామెంట్ చేసింది. ఈ క్రమంలోని నాటు నాటు పాట  బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

అదేంటంటే త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించిన ట్రైలర్ కట్ ని ఆల్రెడీ రాజమౌళి కట్ చేసాడని తెలుస్తోంది. అంతేకాదు డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి రాజమౌళి నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ సినిమా ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన హీరోల చిన్న టీజర్లు,గ్లిమ్స్ వీడియోలు భారీ రికార్డులను క్రియేట్ చేశాయి. అలాంటిది సినిమా ట్రైలర్ వచ్చిందంటే సోషల్ మీడియా షేక్ అవ్వడం గ్యారెంటీ అని అంటున్నారు అభిమానులు. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్ శ్రేయ శరణ్ సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: