ప్రభాస్ చాలాకాలం తర్వాత చేసిన ప్యూర్ లవ్స్టోరి 'రాధేశ్యామ్'. రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమాని మూడుసంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు ప్రొడక్షన్ హౌజెస్ గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ తో పాటు హిందీ నిర్మాణ సంస్థ టీ-సీరిస్ కలిసి నిర్మించాయి. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో బాక్సింగ్ బ్యాక్డ్రాప్తో 'లైగర్' అనే సినిమా వస్తోంది. తెలుగు, హిందీ బైలింగ్వల్గా రూపొందుతోన్న ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్టైసన్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని పూరీ టాకీస్తో కలిసి నిర్మిస్తున్నాడు కరణ్ జోహార్.
యూనిక్ మూవీస్తో బాక్సాఫీస్ దగ్గర సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు అడివి శేష్. సినిమా సినిమాకి కొత్తగా ట్రై చేస్తోన్న ఈ హీరో, ఇప్పుడు 'మేజర్' అనే సినిమాతో వస్తున్నాడు. ముంబాయి 26/11 దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్న క్రిష్ణన్ కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా. ఇక మహేశ్ బాబు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో సోనీ పిక్చర్స్ కూడా పెట్టుబడులు పెట్టింది.సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తోన్న 'పుష్ప' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ టైమ్ స్టైలిష్ స్టార్ రగ్గడ్ లుక్లో కనిపించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోస్టర్స్తోనే అంచనాలు పెంచిన ఈ సినిమా సెట్స్లో ఉండగానే మంచి బిజినెస్ అయ్యింది. ఎఎ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్స్ లాంటి సంస్థలు డిస్ట్రిబ్యూటింగ్ రైట్స్ తీసుకున్నాయి.