రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా పాన్ ఇండియా హీరోగ మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను కమిటైన సంగతి తెలిసిందే ఈ ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కడం విశేషం ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పైగా సినిమాలున్నాయి అందులో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ కూడా ఒకటి యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది అయితే ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

 అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక గంట సేపు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈయన దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ప్రభాస్ కి 150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అయితే ఈ విషయమే గనుక నిజమైతే భారత సినిమా ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిగా రికార్డు బద్దలు కొడతాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా 2022 చివరి నాటికి అయినా లేదా 2023 ప్రారంభంలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 ఇంతే కాకుండా మరో వైపు తానాజీ ఫేం ఓం రావత్‌తో ఆది పురుష్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. వీటితో పాటుగా నాగ్ అశ్విన్ ప్రాజెక్టులో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. దీంతో పాటు బాలీవుడ్ లో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ లతో కలిసి కొన్ని కీలక పాత్రలో కనిపించనున్నాడట ప్రభాస్. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధేశ్యాం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: