అయితే కొన్నేళ్ల ముందు వరకు బాలీవుడ్ నటులు మాత్రమే కోట్ల పారితోషకం అందుకునేవారు. కానీ రాను రాను అది మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పాకింది. ఒక్కప్పుడు కోటి తీసుకున్న హీరోలు కూడా ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నారంటేనే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మన బడా హీరోలు అందుకుంటున్న రెమ్యూనరేషన్ చూసి ఆశ్చర్యపోతున్న జనాలకు..యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. టాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనరేష్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఒక్కో సినిమాకి 100కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయి యంగ్ స్టార్ ప్రభాస్ పారితోషకం విషయంలో అసలు తగ్గట్లేదు. అంతేకాదు తన సినిమాల బడ్జెట్ల విషయంలో, పారితోషకాల విషయంలోను కొత్త రికార్డులు నెలకొల్పుతూ..పక్క హీరోలకు దడ పుట్టిస్తున్నాడు. కాగా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గాను ఆయన ఏకంగా రూ.150 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకోబోతున్నారట. దీంతో ప్రభాస్ తన రికార్డ్ తానే బద్దలు కొట్టి మరో సరికొత్త రికార్డ్ నెలకొల్పబోతున్నాడు. నిజానికి ప్రభాస్తో సినిమా చేయాలని టీ సిరీస్ సంస్థ ఎప్పట్నుంచో చూస్తుందట. అందుకే ఆయన అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్దపడ్డారట. ఈ భారీ ఆఫర్తోనే ప్రభాస్ ను ఈ సినిమాకు ఒప్పించినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.