ఒకప్పుడు దాదాపు అన్ని సినిమాలు ఎన్నో సందేశాలను అందించేవి. తినే తిండి, సహాయం చేసిన చేయి, జన్మనిచ్చిన తల్లి తండ్రులు, ఆశ్రయమిచ్చిన వారి రుణం, విద్య నేర్పిన గురువు ఇలా పలు రకాల కోణాలను కలగలిపి తమ కథకు జోడించి సినిమాలు చిత్రీకరించేవారు. అదే విధంగా వాటిని ఆదరించేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పటి జనరేషన్ లో గ్లామర్ ని వొలకబోసే మోడ్రన్ సినిమాలు ఎక్కువయ్యాయి. స్వఛ్చమైన న్యాయమైన సమాజాన్ని నిర్మించేందుకు ఉపయోగపడే సందేశాలు అందించే సినిమాలు తక్కువ అయ్యాయి. అలాంటి అరుదైన సినిమాలలో ఒకటి "మహర్షి". ఈ సినిమా అటు ఫాస్ట్ జనరేషన్ ఆడియన్స్ ను అలరిస్తూనే సమాజాన్ని చైతన్యంతో నింపి తట్టి లేపే సందేశాన్ని అంతే అందంగా , అర్థవంతంగా అందించింది.

అంతేకాదు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మహేష్ బాబు కెరీర్లో గొప్ప సందేశాత్మక చిత్రంగా నిలిచింది. ఈ సినిమా మెయిన్ థీమ్ "దేశానికే వెన్నెముక రైతు". అలాంటి రైతు జీవితం నేడు ఎలా ఉంది, వారికి ఏం గౌరవం దక్కుతుంది, వారు సమాజానికి ఎంతో ఇస్తున్నారు. కానీ అదే సమాజం వారికి ఏమి తిరిగి ఇస్తోంది? ఒక రైతు తలుచుకుంటే బీడు భూమిలో సైతం పంట పండించగలడు. ఇలా ఎన్నో పాయింట్స్ కథకు బలాన్ని చేకూర్చాయి.  ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్ గా కథకి కనెక్ట్ అవుతారు. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగానే దట్టించారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా  సక్సెస్‌కు అసలైన అర్థం, సరైన నిర్వచనం అని చెప్పవచ్చు. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు జీవితంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో అన్ని అవరోధాలను దాటుకుని  ఎలా అత్యున్నత స్థాయికి  చేరుకుంటాడు . అలాగే స్నేహితుడి కోసం ఓ గ్రామానికి వెళ్లిన ఆ యువకుడు ఎలా గ్రామ కోసం లీడర్ లా నిలబడి పోరాడుతాడు, రైతులకు అండగా నిలిచి గ్రామానికి వెలుగులు తెస్తాడు అన్న కథనంతో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని ఘన విజయాన్ని అందుకుంది. ఈహతే వాస్తవంగా ఈ సమాజము ఎంతవరకు రైతును గౌరవిస్తూ? వారిని బ్రతకనిస్తోంది? సమాజం అంటే ప్రజలు ప్రభుత్వం అంతా కలిపి వస్తుంది. సరైన ప్రభుత్వాలు ఉంటే ఈ రోజు రైతుల ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: