ఇక రిసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న "ఆచార్య" సినిమా లేట్ అవ్వడానికి కారణం హీరోయిన్. యస్.. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని పెడతాం అని ఆలోచించడానికి సుమారు 9 నెలలు ఆలోచించారు కొరటాల. ఆ తర్వాత వెతికి వెతికి ఫైనల్ గా కాజల్ను సెట్ చేసారు. దీంతో అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఈ సినిమాలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఓ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తుండడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్స్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న క్రమంలో.. నేడు ఆచార్య సినిమాకు సంబంధించిన ఓ అద్దిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నామని చిత్రయూనిట్ ప్రకటించారు.
ఇక దీంతో ఆచార్య సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసారు "ఆచార్య టీం". ఎలాంటి అప్డేట్ ఇస్తారా అని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు బిగ్ షాకిచ్చింది ఆచార్య. అనుకున్న సమయానికి అప్డేట్ రావ్వడం లేదు అంటూ ఓ పోస్ట్ పెట్టారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశ పడ్డారు. ఈ మేరకు కొణిదల ప్రొడక్షన్స్ ఈ ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. "కొద్దిపాటి ఆలస్యం అవుతుంది.. కానీ ఖచ్చితంగా అప్డేట్ మాత్రం అందిరిపోతుంది" అంటూ రాసుకొచ్చారు. ఇక మెగా ఫ్యాన్స్ చిరు- చరణ్ కలిసి ఒకే స్క్రీన్ పై నటిస్తే చూడాలని ఎప్పటినుంచో ఆశగా దురుచూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కల ఈ సినిమాతో నిజం కాబోతుందనే చెప్పాలి.