ఒక
హీరో సినిమాకి మరొక
హీరో వచ్చి ఆ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పి సినిమాను మనస్ఫూర్తిగా అభినందించే పద్ధతి ఇటీవల
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మొదలైంది. గతంలో ఈగోల కారణంగా మన హీరోల మధ్య దూరం ఉంది. ఇప్పుడిప్పుడే మన హీరోలు అప్డేట్ అవుతూ ఈగో లు పక్కన పెట్టి తోటి
హీరో సినిమా కి గెస్ట్ గా వచ్చిన
సినిమా ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. చాలా మంది పెద్ద హీరోలు ఒకరికొకరు సహాయ పడడం ఇప్పుడు
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో జరుగుతుంది.
అలా
టాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా విడుదల కాబోతున్న ఆర్ ఆర్ ఆర్
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ కి
ప్రభాస్ వస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఇద్దరు హీరోలకు కూడా
ప్రభాస్ చాలా దగ్గరి సన్నిహితుడు. అంతేకాదు ఈ
సినిమా దర్శకుడైన రాజమౌళికి అత్యంత సన్నిహితుడు. వీరిద్దరూ కలిసి మూడు సినిమాలను చేయగా
రాజమౌళి తన
సినిమా కెరీర్ సగం సమయం మొత్తం
ప్రభాస్ తోనే ఉండడం విశేషం. ఆ విధంగా
ప్రభాస్ తో ఉన్న చనువు కారణంగా
రాజమౌళి ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ కి గెస్ట్ గా రావాలని అని ఆహ్వానించాడట.
అయితే ఇది ఈ సినిమాలో హీరోలు గా నటిస్తున్న ఈ ఇద్దరు హీరోలకు నచ్చడం లేదని భోగట్టా. మెగా
హీరో రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్
ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నాక
ప్రభాస్ ఎందుకని వారిలో వారే గుస గుస లాడుకుంటున్నారట. ఈ విషయం
రాజమౌళి చేరడంతో
ప్రభాస్ ను పిలిచి ఆయనను అవమానించడం ఇష్టం లేక మధ్యలోనే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారట. ఏదేమైనా ఈగో లు లేని ఇండస్ట్రీగా ఎదుగుతున్న
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఈ ఇద్దరు ఇలా ఆలోచించారు అనే వార్త బయటకు రావడం పట్ల కొంత మంది నిరాశగా ఉన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.