సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కిస్తే కేవలం నటీనటుల నటన బాగుంటే సరిపోదు ..కథ, కథనం కూడా బాగుండాలి. ఇక ఇవి రెండూ ఉంటే సరిపోదు.. సంగీతం కూడా ఆ సినిమాకు ఒకసారి హైలెట్ గా నిలుస్తూ ఉంటుంది. అంతే కాదు చాలా సందర్భాలలో సంగీతం , పాటల వల్ల కూడా సినిమాలు సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటాయి. అలా సినిమాలకు హైలెట్ గా నిలిచే సంగీత దర్శకులు కూడా అంతే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం గమనార్హం. ఇకపోతే మన టాలీవుడ్ లో ఉన్న టాప్ టెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

1. దేవి శ్రీ ప్రసాద్:ఆయన గత ఏడాది వరకు కేవలం ఒక్కో సినిమాకు  2 కోట్ల రూపాయల లోపే తీసుకునేవారు. ప్రస్తుతం ఈయన  పనిచేస్తున్న సినిమాలకు ఒక్కో సినిమాకు రూ.మూడు కోట్లు అనుకుంటున్నట్లు సమాచారం.

2. ఎస్.ఎస్.థమన్ :వరుస సినిమాలతో బిజీగా ఉన్న థమన్ ఈ సినిమాకు రూ.1 కోటికిపైగా తీసుకుంటున్నట్లు సమాచారం.

3.అనిరుద్ రవిచంద్రన్ :కొలవెరి పాటతో సంగీత ప్రపంచాన్ని ఊపేసిన ఈయన ప్రస్తుతం 2 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నారు.

4. ఏ.ఆర్.రెహమాన్:ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ వెయ్యి రూపాయలతో తన కెరీర్ ని మొదలు పెట్టి,  ఆయన ప్రస్తుతం 10 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు.

5. ఎం ఎం కీరవాణి:ఈయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఒక కోటిన్నర రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు.

6. మణి శర్మ:1990 లోనే 90 వేలకు పైగా న్యూస్ ని సొంతం చేసుకున్న ఆయన సంగీతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈయన రూ.50 లక్షల కంటే ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

7. గోపీ సుందర్:గీత గోవిందం సినిమా తో మంచి ఫాంలోకి వచ్చిన ఈయన..తన పారితోషికం  ప్రస్తుతం రూ.50 లక్షలు దాటినట్లు సమాచారం.

8. అనూప్ రూబెన్స్:
ఇక ప్రస్తుతం ఈయన రెమ్యూనరేషన్ రూ.40 లక్షల లోపే అనుకుంటున్నట్లు సమాచారం.

9. మిక్కీ జే మేయర్:
మహానటి సినిమా తర్వాత ఈయన ఒక రూ. కోటి వరకు పారితోషికం అందుకుంటున్న ట్లు సమాచారం.

10. జీబ్రాన్:
జీబ్రాన్ ఒక్కో సినిమాకు 50 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: