కథ లో అదిరిపోయే మలుపులు ఉన్నాయి. ఇక కథలో పోలీసుల కంటే అన్ని విషయాల్లోనూ ముందే ఉండడం రాంబాబు స్పెషాలిటీ అని చెప్పాలి. ఆ తెలివే దృశ్యం 1లో తనని, తన కుటుంబాన్నీ కాపాడు కుంది. అయితే ఇప్పుడు మరోసారి అదే తెలివి తేటలు దృశ్యమ్ 2లో వాడేశాడు దర్శకుడు జీతు జోసెఫ్. వరుణ్ శవం ఎక్కడుంది ? అనేది అందరికీ తెలిసిన విషయమే అయినా.. అది మాత్రం పోలీసులకు తెలియదు. మరి దానిని పోలీసులు ఎలా కనుకున్నారు ? అన్నది మరో ట్విస్టింగ్ పాయింట్.
ఆ శవం పోలీసులకు దొరికాక కూడా .. ఆ ఆచూకి తెలిశాక కూడా రాంబాబే ఈ హత్య చేశాడని తెలిసినా కూడా దాని నుంచి ఎలా భయట పడ్డాడు ? అన్నదే ఈ కథలోని కీలక మైన పాయింట్. ఈ దృశ్యం 2 సినిమాలో ఈ రెండే కీలక మైన పాయింట్స్. ఈ రెండిటిని దర్శకుడు చాలా చాలా బాగా డీల్ చేశాడు. మొత్తం 150 నిమిషాల పాటు ఉన్న సినిమాలో 100 నిమిషాలు తొలి భాగం అంతా స్లో గానే నడుస్తుంది. అయితే హత్య చేసిన తాలుకూ భయం రాంబాబు కుటుంబ సభ్యుల్ని వెంటాడడం , ఈ టెన్షన్ తోనే సినిమా ఉంటుంది. చివరి 50 నిమిషాలు మాత్రం అదిరిపోయే ట్విస్టులతో సినిమాను హిట్ చేసింది.