ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ త‌న మొండి ప‌ట్టు ద‌ల వీడ‌లేదు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందు నుంచి ఆన్ లైన్ టిక్కెట్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ పెడుతున్న‌ట్టు చెప్పింది. ఇక ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద పెద్ద నిర్మాత‌ల నుంచి డిస్ట్రిబ్యూట‌ర్ల వ‌ర‌కు చాలా మంది ఏపీ ప్ర‌భుత్వంతో రెండు మూడు సార్లు లాబీయింగ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. మంత్రి పేర్ని నానితో ప‌దే ప‌దే మీట్ అయ్యారు. విన్న‌వించు కున్నారు. అయినా కూడా ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గిన‌ట్టు లేదు. త‌గ్గించిన రేట్ల తోనే థియేట‌ర్ల‌లో టిక్కెట్లు అమ్మాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

దీనికి తోడు ఆన్ లైన్ పోర్ట‌ల్‌.. అది కూడా ప్ర‌భుత్వం పెట్టిన పోర్ట‌ల్ ద్వారానే టిక్కెట్లు అమ్మాల‌ని నిన్న అసెంబ్లీలో నిర్ణ‌యం తీసేసుకు న్నారు. ఇక రోజుకు నాలుగు షోలు మాత్ర‌మే వేయాల‌ని.. పెద్ద‌, చిన్న సినిమాలు అన్న తేడా లేకుండా ఒకే రేటుపై టిక్కెట్ అమ్మాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో పెద్ద సినిమాల‌కు భారీ న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌గ‌న్ చివ‌ర్లో ఏదైనా మారి పెద్ద సినిమాల‌కు టిక్కెట్ రేట్లు పెంచుకునే అవ‌కాశం ఇవ్వ‌క‌పోతే పెద్ద సినిమాలు అన్నింటికి భారీ న‌ష్టం త‌ప్ప‌ద‌నే అంటున్నారు. ఈ రేట్ల‌తోనే ఏపీలో టిక్కెట్లు అమ్మితే వ‌చ్చే నెల‌, సంక్రాంతికి వ‌స్తోన్న పెద్ద సినిమాల‌కు కోట్ల‌లో న‌ష్టం త‌ప్పేలా లేదు. బాల‌య్య అఖండ కు 9 కోట్లు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పకు 16 కోట్లు న‌ష్టం వ‌స్తుంద‌ట‌.

ఇక రాజ‌మౌళి తెర‌కెక్కించే ఆర్ఆర్ఆర్ కు రు. 30 కోట్ల వరకు లాభాల్లో కోత పడిపోతుంద‌ని అంటున్నారు. ఏపీలో రిలీజ్ అయ్యే అన్ని పెద్ద సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ లో 20 శాతం తగ్గించాల‌ని బ‌య్య‌ర్లు ప‌ట్టు బ‌డుతున్నార‌ట‌. మ‌రి జ‌గ‌న్ దెబ్బ టాలీవుడ్ పెద్ద హీరోల‌కు మామూలు దెబ్బ కాదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: