బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ' సినిమాలో ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అఖండ ట్రైలర్ లో విలన్ గా శ్రీకాంత్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక డిసెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.ఈ క్రమంలోనే విలన్గా చేయడంపై శ్రీకాంత్ స్పందిస్తూ..' నా సినిమా కెరీర్ ను విలన్ గా నే మొదలు పెట్టాను  ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యా. గతంలో యుద్ధం శరణం అనే సినిమాలో విలన్గా నటించా.

 అయితే బోయపాటి శ్రీను నన్ను విలన్ పాత్రలు చేయడం ఆపాలని సూచించాడు. నన్ను మెయిన్ విలన్ గా చూడాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పాడు. నేను వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో చాలా ఆఫర్లను రిజెక్ట్ చేశాను. ఆ సమయంలో సడన్ గా బోయపాటి గారు నాకు ఫోన్ చేసి అఖండ సినిమా గురించి చెప్పారు. అయితే బాలకృష్ణ గారితో విలన్ గా నటించడం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో వరదరాజులు పాత్ర కోసం తన మేకర్ మొత్తాన్ని మార్చుకున్నానని శ్రీకాంత్ తెలియజేశారు. ఇక బాలకృష్ణ గారితో ఇది నా రెండో సినిమా. ఇంతకుముందు ఆయనతో శ్రీరామరాజ్యం అనే సినిమాలో నటించా. ఆ సినిమాలో బాలకృష్ణ సోదరుడిగా నటించాను.

ఆ సినిమాలో లక్ష్మణుడి పాత్ర చాలా సున్నితమైనది. కానీ అఖండ సినిమాలో నా పాత్ర రావణాసురుడిలా ఉంటుంది. నేను బాలకృష్ణ గారు సినిమాలో ఓ ఫైట్ సీన్ ని ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల పాటు దుమ్ములో చేశాం. చాలా కష్టంగా అనిపించినా.. బాలకృష్ణ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆయన నన్ను సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూడాలని అనుకున్నారు. ఇక అదే విషయాన్ని బోయపాటి శ్రీను గారికి చెప్పారు. ఇక అఖండ ట్రైలర్ విడుదలైన తర్వాత నా నటన అద్భుతంగా ఉందని నాకు కాల్స్ కూడా వస్తున్నాయని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఇక అఖండ సినిమా గురించి, తన పాత్ర గురించి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరోసారి రెట్టింపు అయ్యాయనే చెప్పాలి. మరి అక్కడ సినిమా శ్రీకాంత్ కి విలన్ గా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: